మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు ఉమెన్స్ డే కానుక
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- సాధారణ సెలవులు 20కి పెంపు
- ఇప్పటివరకు 15గా ఉన్న సాధారణ సెలవులు
- దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
- పలువురు మహిళలకు సన్మానం
కాగా, సీఎం జగన్ ఇవాళ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిశ వాహనాలను ప్రారంభించారు. 900 దిశ స్కూటీలను, 18 దిశ క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ వాహనాలను జీపీఎస్ తో పాటు, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్ తో అనుసంధానం చేశారు.
అంతేకాదు, మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన పోలీసు కానిస్టేబుల్ సరస్వతి, పారిశుద్ధ్య కార్మికురాలు మాబున్నీసా, వలంటీరు కల్యాణి, ఆరోగ్య కార్యకర్త శాంతిలను సన్మానించారు.