బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి వాస్తవానికి ఓ నక్సలైట్: విరుచుకుపడిన తృణమూల్
- నిన్న బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి
- నాలుగు పార్టీలు మారిన ఆయనకు విశ్వసనీయత ఎక్కడిదన్న టీఎంసీ
- ఈడీని చూపి బెదిరించడంతోనే బీజేపీలో చేరారని ఆరోపణ
నక్సలైట్ అయిన మిథున్ తొలుత సీపీఎంలో చేరారని, ఆ తర్వాత టీఎంసీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారని, ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీ పంచన చేరారని సౌగత్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, నిన్న కోల్కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.