ఎవరు బాగా ఆడతారో రండి తేల్చుకుందాం: బీజేపీ నేతలకు మమత సవాల్
- చమురు, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పాదయాత్ర
- పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ
- బీజేపీ నేతలపై ధ్వజం
- తనను దోపిడీదారు అనడంపై ఆగ్రహం
- బీజేపీ నేతలే దోపిడీదారులను ప్రత్యారోపణలు
ఇక, తృణమూల్ నేతలు ముఠాగా ఏర్పడి కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలపైనా దీదీ బదులిచ్చారు. మోదీ, అమిత్ షానే ఓ ముఠా కట్టారని, దేశంలో అందరికీ తెలిసిన ముఠా ఇదేనని విమర్శించారు. ఈ సందర్భంగా "ఆట మొదలైంది" అనే తమ ఎన్నికల నినాదాన్ని మరోసారి ఉద్ఘాటించారు. "ఎప్పుడు వస్తున్నారో డేట్, టైమ్ ఫిక్స్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు రండి... మీరెంత ఆడతారో, నేనెంత ఆడతానో చూసుకుందాం" అని మమతా సవాల్ విసిరారు.