రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారు... వారి ఆదరణ చూస్తే భయమేస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
- నాడు రావాలి జగన్ అన్నారని వెల్లడి
- ఇప్పుడు గాలి మారిందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
- తాడిపత్రిలో ప్రజాభిమానం తమకే ఉందని స్పష్టీకరణ
- మున్సిపల్ ఎన్నికల్లో తామే నెగ్గుతామని ధీమా
గత రెండున్నరేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను తనతో పంచుకుంటున్నారని జేసీ వివరించారు. రాష్ట్రంలో టీడీపీకి అత్యధిక పంచాయతీ స్థానాలు వచ్చింది తన నియోజకవర్గంలోనే అని వెల్లడించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కచ్చితంగా తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.