ప్రియుడిని పెళ్లాడేందుకు యువతి డ్రామా... బెడిసి కొట్టడంతో జైలుపాలు!
- పంజాబ్ లోని జలంధర్ లో ఘటన
- పెళ్లి కోసం బంధువుల కుమార్తె కిడ్నాప్
- అరెస్ట్ చేసిన పోలీసులు
తమ బంధువులకు చెందిన ఓ మూడేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది. ప్రియుడితో పెళ్లి కావడానికి కొంత సమయం పడుతుందన్న ఆలోచనలో ఉన్న ఆమె, హోటల్లో అతనితో కలసి ఉండాలంటే, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవాలని, అందుకు తన పక్కనే పాప ఉంటే బాగుంటుందని భావించింది. అయితే, పాప కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, పాప గురించి వెతుకులాట ప్రారంభించారు. వీరిద్దరినీ జలంధర్ లోని ఓ హోటల్ లో గుర్తించి, పాపను రక్షించారు. తాను పాపను కేవలం రక్షణ కోసమే తెచ్చుకున్నానని, హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని నిషు ద్వివేది పోలీసుల విచారణలో వెల్లడించిందట. ఇక వారిద్దరిపై కిడ్నాస్ సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.