టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు: కిషన్ రెడ్డి
- హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో సమావేశం
- ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా సమావేశం
- ఉద్యమ ద్రోహులు ప్రగతిభవన్ లో ఉన్నారన్న కిషన్ రెడ్డి
- కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని వ్యాఖ్యలు
ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తెలంగాణకు కీలకమని అన్నారు.