అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు ఆరోపణ
- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా హరీశ్ రావు
- టూరిజం ప్లాజా హోటల్ లో కార్యక్రమం
- రాజ్యాంగ హక్కులు కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
- అదే జరిగితే వందేళ్లు వెనక్కిపోతామని వివరణ
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇవాళ అందరం ఇక్కడున్నామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాస్తూ, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మాయమాటలు చెబుతూ, బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు ఎవరూ మోసపోరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై అందరూ ఆలోచించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓట్లు వస్తూనే ఉంటాయని, ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు సూచించారు.