బంగారు నాలుక ఉన్న 2 వేల ఏళ్ల నాటి మమ్మీ గుర్తింపు!
- ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో బయల్పడిన మమ్మీ
- క్లియోపాత్రా కోసం కొనసాగుతున్న తవ్వకాలు
- తవ్వకాల్లో బయటపడిన పలు సమాధులు
ఈజిప్టును క్రీస్తుపూర్వం ఫారోలు పాలించారు. వీరిలో చివరగా క్లియోపాత్రా పాలించారు. ఈమె తర్వాత ఈజిప్టును రోమన్లు పరిపాలించారు. మరోవైపు అలెగ్జాండ్రియాలో తాజాగా దొరికిన మమ్మీ నోట్లో బంగారు నాలుకను ఉంచారు. తమ జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా మాట్లాడతారనే నమ్మకంతో ఈ మమ్మీకి బంగారు నాలుకను ఉంచినట్టు విశ్వసిస్తున్నారు.