ఏపీ మునిసిపల్ పోల్స్: 7,263 నామినేషన్ల ఉపసంహరణ
- నిన్నటితో ముగిసిన ఉపసంహరణ గడువు
- అనంతపురం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యధిక ఉపసంహరణలు
- బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను నేడు ప్రకటించే అవకాశం
ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల ఎన్నికల బరిలో 8,787 మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం నిన్ననే ప్రకటించాల్సి ఉన్నా విజయవాడ, విశాఖపట్టణం నగర పాలక సంస్థల్లో లెక్కల విషయంలో జాప్యం జరగడంతో జాబితా ప్రకటించలేకపోయారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ నేడు వెల్లడించే అవకాశం ఉంది.