పలమనేరులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. మునిసిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం
- వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపణ
- వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట
- ఇరు వర్గాలను దూరంగా పంపేసిన పోలీసులు
అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో కార్యాలయంలోకి ఎవరినీ పంపబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇరు పార్టీల నేతలను పోలీసులు అక్కడి నుంచి దూరంగా పంపించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పలమనేరు పురపాలికలో 26 వార్డులకు గాను 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.