ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ఆప్ స్వీప్.. బీజేపీకి ఘోర పరాభవం!
- ఐదు వార్డులకు గాను నాలుగింటిలో విజయం
- ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
- 15 ఏళ్లు పాలించిన బీజేపీకి ‘సున్నా’
అదే సమయంలో బీజేపీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ వ్యవహరించిన తీరు నచ్చకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఎంసీడీని 15 ఏళ్లపాటు పాలించిన బీజేపీ దానిని అవినీతి శాఖగా మార్చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దానిని ప్రక్షాళన చేయాలనే ప్రజలు తమను గెలిపించారని అన్నారు.