ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ
- 35,804 కరోనా పరీక్షలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 33 కొత్త కేసులు
- ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 57 మంది
- యాక్టివ్ కేసుల సంఖ్య 774
ఏపీలో ఇప్పటివరకు 8,90,080 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,137 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 774 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 7,169 మంది మరణించారు.