కేజ్రీవాల్ కు భద్రత కుదింపు... అటువంటిది లేదన్న హోమ్ శాఖ!
- నేడు సూరత్ లో కేజ్రీవాల్ భారీ ర్యాలీ
- ఆరుగురు కమాండోలను రెండుకు తగ్గించారన్న ఆప్
- సాధారణ మార్పులో భాగమేనన్న హోమ్ శాఖ
- భద్రత తగ్గించలేదని స్పష్టీకరణ
ఈ నేపథ్యంలో నేడు కేజ్రీవాల్ ప్రత్యేకంగా సూరత్ లో పర్యటించి, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేక ర్యాలీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి బందోబస్తుగా ఉండాల్సిన పోలీసుల సంఖ్యను ప్రభుత్వం కుదించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాలతోనే భద్రతను కుదించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ కు భద్రతగా ఆరుగురు కమాండోలు ఉండాలని, కానీ ఆ సంఖ్యను రెండుకు తగ్గించారన్నది వారి ఆరోపణ. దీనిపై హోమ్ శాఖ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, తామేమీ భద్రతను తగ్గించలేదని, సాధారణ మార్పుల్లో భాగంగా నలుగురు కమాండోలను మార్చామని, ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతూనే ఉందని అన్నారు.