Team India: 'నరేంద్ర మోదీ స్టేడియం'లో మూడో టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!

England won the toss and elected to bat in third test against India
  • మొతేరా వేదికగా డేనైట్ టెస్ట్ మ్యాచ్
  • ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగిన ఇండియా
  • 100వ టెస్ట్ ఆడుతున్న ఇశాంత్ శర్మ

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు గుజరాత్ లోని మొతేరా వేదికగా ప్రారంభమైంది. డేనైట్ టెస్ట్ అయిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియం ఇటీవలే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్టేడియం కెపాసిటీ లక్షా 10 వేలు. ఈ స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం' అని పేరు పెట్టారు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్‌ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.
 
ఇంగ్లండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

  • Loading...

More Telugu News