అదే జరిగితే 60 శాతం పంచాయతీలను టీడీపీ గెలిచేది: కేశినేని నాని
- వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతోంది
- పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
- టీడీపీ వారిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదు
- శాంతియుతంగా జరిగి ఉంటే టీడీపీ 60 శాతం స్థానాల్లో నెగ్గేది
వైసీపీ వాళ్లు టీడీపీ వారిపై దాడి చేసి... తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని కేశినేని నాని దుయ్యబట్టారు. టీడీపీ వారిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదని అన్నారు. అరాచకాలు, పోలీసులు అండతో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుందని... ఎన్నికలు శాంతియుతంగా జరిగి ఉంటే టీడీపీ 60 శాతం స్థానాల్లో గెలుపొందేదని చెప్పారు.