ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగిసిన గడువు
- ఏపీలో రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- రేపు నామినేషన్ల పరిశీలన
- ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు అవకాశం
- మార్చి 14న పోలింగ్
- మార్చి 17న ఓట్ల లెక్కింపు
గుంటూరు-కృష్ణా స్థానం కోసం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల కోసం గుంటూరు జిల్లాలో 59, కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 13,121 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.