ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగిసిన గడువు

AP Teacher MLC Elections
  • ఏపీలో రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • రేపు నామినేషన్ల పరిశీలన
  • ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు అవకాశం
  • మార్చి 14న పోలింగ్
  • మార్చి 17న ఓట్ల లెక్కింపు
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. గుంటూరు-కృష్ణా... తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 26. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.

గుంటూరు-కృష్ణా స్థానం కోసం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల కోసం గుంటూరు జిల్లాలో 59, కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 13,121 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Nominations
Teachers MLC Elections
Polling

More Telugu News