నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్దూకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
- రిపబ్లిక్ డే నాడు హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
- ఎర్రకోటకు దూసుకుపోయి మతపరమైన జెండా ఎగురవేసిన వైనం
- హింసాత్మక ఘటనల్లో 500 మంది పోలీసులకు గాయాలు
సిద్దూ ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్జీత్ కౌర్ ముందు ఆయనను పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.