కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు
- 2018లో మమత మేనల్లుడిపై అమిత్ షా వ్యాఖ్యలు
- కోర్టులో పరువునష్టం దావా వేసిన అభిషేక్ బెనర్జీ
- వ్యక్తిగతంగా గానీ, లాయర్ ద్వారా గానీ హాజరుకావాలంటూ అమిత్ షాకు సమన్లు
- ఈ నెల 22న కోర్టు ఎదుట తన వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ
అమిత్ షా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో అభిషేక్ బెనర్జీ విధాన్ నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ విచారణలో అమిత్ షా సమాధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.