పోలీసుల అదుపులో అడ్వొకేట్ దంపతుల హత్య కేసు నిందితులు!
- పెద్దపల్లి జిల్లాలో అడ్వొకేట్ దంపతుల దారుణహత్య
- పట్టపగలే హత్యకు గురైన వామనరావు, నాగమణి
- నిందితులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు
- నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం
నిన్న పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో తమ వాహనంలో వెళుతున్న అడ్వొకేట్ దంపతులను మరో వాహనంలో వచ్చి అడ్డగించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పట్టపగలే జరిగిన ఈ హత్యాకాండ రోడ్డుపై వెళ్లే వాహనదారులను నిశ్చేష్టులను చేసింది.