కర్నూలు జిల్లా ప్రమాద మృతులకు పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి
- కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- 14 మంది మృత్యువాత
- స్పందించిన పీఎంవో
- తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు
- ఇప్పటికే ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
అంతేకాకుండా, తీవ్రగాయాల పాలైన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తారని తెలిపారు. అటు, ఏపీ సీఎం జగన్ ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.1 లక్ష సాయం అందించాలని నిర్ణయించారు.