ఈ కేసును లోతుగా విచారించాల్సి ఉంది: కొడాలి నాని పిటిషన్ పై హైకోర్టు
- పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు మీడియాతో మాట్లాడొద్దని నానిని ఆదేశించిన ఎస్ఈసీ
- హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన కొడాలి నాని
- సరైన వీడియో టేపులు అందించాలని ఆదేశించిన కోర్టు
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎస్ఈసీ, కొడాలి నాని తరపు న్యాయవాదులు అందించిన వీడియో టేపులతో సంతృప్తి చెందలేదు. కొడాలి నానితో పాటు, ఎస్ఈసీ తరపు న్యాయవాది కూడా సరైన వీడియోలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని... ఈ కేసులో కోర్టుకు సహాయపడేందుకు సాయంత్రంలోగా అమికస్ క్యూరీని నియమించనున్నామని చెప్పారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.