Sachin Joshi: సినీ నటుడు, బిజినెస్ మేన్ సచిన్ జోషి అరెస్ట్!

  • ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్
  • 18 గంటల విచారణ అనంతరం అరెస్ట్
  • 100 కోట్లు కాజేశారన్న ఆరోపణలు
Actor Sachin Joshi Arrest

తెలుగు ప్రేక్షకులకు 'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి', 'జాక్ పాట్' తదితర చిత్రాలతో సుపరిచితుడైన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.

అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News