గత కొన్నేళ్లుగా విద్వేషం అనేది క్రికెట్ క్రీడను కూడా వదల్లేదు: రాహుల్ గాంధీ
- ఉత్తరాఖండ్ క్రికెట్ కోచ్ వసీం జాఫర్ రాజీనామా
- జట్టు ఎంపికలో ఇతరుల జోక్యం ఎక్కువైందన్న జాఫర్
- జాఫర్ మతం పేరుతో జట్టును చీల్చాడంటున్న ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం
- విద్వేషం అనేది సాధారణ అంశంలా మారిందన్న రాహుల్
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గత కొన్నేళ్లుగా విద్వేషం అనేది ఓ సాధారణ అంశంలా మారిపోయిందని, చివరికి మనం ఎంతగానో అభిమానించే క్రికెట్ క్రీడను కూడా కమ్మేసిందని విచారం వ్యక్తం చేశారు. భారతదేశం మనందరికి చెందింది, మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే అవకాశం విద్వేషవాదులకు ఇవ్వొద్దు అని స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలోనూ రాహుల్ తన గళం వినిపించారు. బీజేపీ తరహాలో ప్రతిభకు పట్టం కట్టారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జై షా బీసీసీఐ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్న తెలిసిందే.