Andhra Pradesh: ఏపీ మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు
- ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు
- ఈ నెల 17న మూడో విడత పోలింగ్
- మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో భారీగా ఏకగ్రీవాలు
- 85 పంచాయతీలు ఏకగ్రీవం
- కేవలం రెండు పంచాయతీల్లో ఎన్నికలు
ఏపీలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలి రెండు విడతలతో పోల్చితే మూడో విడతలో ఏకగ్రీవాల సంఖ్య భారీగా నమోదవుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని 67 పంచాయతీల్లో 63 ఏకగ్రీవం కాగా, కేవలం 4 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోనూ భారీగా ఏకగ్రీవాలు అయినట్టు అధికారులు ప్రకటించారు. పుంగనూరు నియోజకవర్గంలో 87 పంచాయతీలు ఉండగా, వాటిలో 85 ఏకగ్రీవం అయ్యాయి. రొంపిచెర్ల మండలంలోని 2 పంచాయతీలకు మాత్రమే ఎన్నికల ద్వారా ఫలితం తేలనుంది. పుంగనూరు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోనూ భారీగా ఏకగ్రీవాలు అయినట్టు అధికారులు ప్రకటించారు. పుంగనూరు నియోజకవర్గంలో 87 పంచాయతీలు ఉండగా, వాటిలో 85 ఏకగ్రీవం అయ్యాయి. రొంపిచెర్ల మండలంలోని 2 పంచాయతీలకు మాత్రమే ఎన్నికల ద్వారా ఫలితం తేలనుంది. పుంగనూరు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం.