సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇక్కడ అదృష్టం ఉండాలంటున్న నిధి!
- గోవాలో మహేశ్ కోసం ప్రత్యేక సెట్స్
- సత్యదేవ్ 'గాడ్సే' షూటింగ్ మొదలు
* ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. దీని తరువాత మరో షెడ్యూలును గోవాలో నిర్వహిస్తారు. ఇందుకోసం గోవాలో ప్రత్యేకమైన సెట్స్ ను కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సెట్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
* యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడుగా 'గాడ్సే' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. గోపి గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.