విశాఖ ఉక్కు వెనుక ఒడిశా కుట్ర ఉంది: ఏపీ మంత్రి అవంతి

Odisha conspiracy is behind Vizag steel says Avanthi
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజకీయ రంగును పులుముకుంది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఒడిశా నేతల కుట్ర ఉందని అవంతి ఆరోపించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని చెప్పారు.

ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సంప్రదించలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే అంతా జరిగిందని ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. ఈ ప్రచారం దుర్మార్గమని అన్నారు. కేంద్రంతో రాష్ట్రం లాలూచీ పడిందనేది అవాస్తమని అన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అంగీకరించబోమని చెప్పారు.
Go Back to Shorts
Avanthi Srinivas
Vijayasai Reddy
YSRCP
Vizag Steel

More Telugu News