దుబాయ్ నుంచి గోవాకి రానున్న మహేశ్!
- మహేశ్ తాజా సినిమా 'సర్కారు వారి పాట'
- గత కొన్నాళ్లుగా దుబాయ్ లో షూటింగ్
- తదుపరి షెడ్యూలుకి గోవాలో ఏర్పాట్లు
- వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల
ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని.. తదుపరి షెడ్యూలు షూటింగును నిర్వహించడానికి అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ షెడ్యూలును గోవాలో నిర్వహించనున్నట్టు తాజా సమాచారం. అక్కడ కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న కుంభకోణాల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.