Sensex: ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 19 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 2 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. కేేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్లు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయులకు మార్కెట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో మార్కెట్లు ఈరోజు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 51,309కి దిగజారింది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.21%), బజాజ్ ఫైనాన్స్ (1.47%), టీసీఎస్ (1.11%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.99%).      


టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.77%), భారతి ఎయిర్ టెల్ (-1.45%), యాక్సిస్ బ్యాంక్ (-1.06%), ఓఎన్జీసీ (-1.04%), నెస్లే ఇండియా (-0.91%).

More Telugu News