KCR: న‌ల్గొండ‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన కేసీఆర్.. స్థానిక బీజేపీ నేత‌ల అరెస్టు

bjp leaders arrest in nalgonda
  • కాసేప‌ట్లో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • హాలియాలో బ‌హిరంగ సభ 
  • అడ్డుకుంటామ‌ని బీజేపీ ప్ర‌క‌ట‌న‌
  • అప్ర‌మ‌త్త‌మైన‌ పోలీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్న విష‌యం తెలిసిందే. పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంత‌రం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయ‌న‌ పాల్గొంటారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు.

మ‌రోవైపు, నల్గొండ జిల్లాలో ప‌లువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొంద‌రిని గృహ నిర్బంధంలో ఉంచారు. హాలియాలో నిర్వహించే సీఎం సభను అడ్డుకుంటామని నిన్న బీజేపీ న‌ల్ల‌గొండ‌ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ప్రకటించిన‌ ఈ నేపథ్యంలో పోలీసులు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

పెద్దవూర మండలం పులిచర్లలోని  శ్రీధర్‌రెడ్డి నివాసంలోనే పోలీసులు ఆయ‌న‌ను గృహ నిర్బంధం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బీజేపీ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో పోలీసులు పలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కాగా, త్వ‌ర‌లో నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గం హాలియాలో కేసీఆర్ స‌భ‌ను టీఆర్ఎస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News