రెండు వికెట్లు తీసిన అశ్విన్... భారీ ఆధిక్యంపై కన్నేసిన ఇంగ్లండ్
- చెన్నైలో రసవత్తరంగా తొలి టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైన భారత్
- రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 2 వికెట్లకు 45 రన్స్
- ఇంగ్లండ్ ఆధిక్యం 286 పరుగులు
ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 2 వికెట్లకు 45 పరుగులు కాగా, ఓవరాల్ గా ఆ జట్టు ఆధిక్యం 286 పరుగులకు చేరింది. డాన్ లారెన్స్, కెప్టెన్ జో రూట్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ మరో 150 పరుగులు చేసినా చాలు... టీమిండియాకు భారీ లక్ష్యం నిర్దేశించవచ్చు. రేపు ఆటకు చివరి రోజు కావడంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.