న్యూఢిల్లీలో కమలా హ్యారిస్ మేనకోడలి దిష్టి బొమ్మలు దగ్ధం... భయపడేది లేదన్న మీనా హ్యారిస్!
- రైతులకు మద్దతుగా మీనా హ్యారిస్ వ్యాఖ్యలు
- విదేశీయుల జోక్యంపై యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆగ్రహం
- తానిలానే మాట్లాడతానన్న మీనా
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "నేను ఇండియాలోని రైతుల మానవ హక్కులను కాపాడటం కోసం మాట్లాడాను. ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూడండి. నేనిలానే మాట్లాడతాను. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంలో నెల రోజుల క్రితం ఏం జరిగిందో చూశాం. దానిపై మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇండియాలో ఇంటర్నెట్ ను ఆపేస్తున్నారు. పారామిలిటరీ దళాలు రైతులపై దాడులు చేస్తున్నాయి" అని అన్నారు.