Andhra Pradesh: ఏపీలో కరోనా అప్ డేట్స్!

  • గత 24 గంటల్లో 95 మందికి కరోనా పాజిటివ్
  • విశాఖ జిల్లాలో ఒకరు మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,162 యాక్టివ్ కేసులు
AP registers 95 new Covid cases

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 25,445 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో విశాఖ జిల్లాలో మహమ్మారి బారిన పడి ఒకరు మరణించారు. మరోపక్క, 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,88,099కి పెరిగింది. 8,79,780 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,157 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News