Madanaplle: జైలులో శివా, శివా అంటూ రాత్రంతా పద్మజ కేకలు.. హడలిపోయిన ఖైదీలు!

  • శివుడినే లోపల వేస్తారా? అంటూ అరుపులు
  • ఆమె కేకలతో తోటి ఖైదీలకు నిద్ర కరవు
  • విశాఖపట్టణం తరలింపు ఆలస్యం
Padmaja cried Shiva Shiva all night

కన్నకుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ తోటి ఖైదీలను మళ్లీ హడలుగొట్టింది. ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ వీరంగమేసింది. శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారు. రాత్రంతా ఆమె కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చింది.

కుమార్తెల హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. దీంతో వీరిని విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు. అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు.

అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది. మరోవైపు, జైలులో ఉన్న పురుషోత్తమ నాయుడు కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

More Telugu News