అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ
- పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
- సంక్షేమానికి పట్టం కట్టామన్న మోదీ
- సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని వెల్లడి
- రైతుల బడ్జెట్ అని వ్యాఖ్యలు
అన్నింటికి మించి ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటే ఉద్యోగ కల్పనకు చేయూతనిస్తుందని వివరించారు. ఈ బడ్జెట్ ను ప్రధానంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు మోదీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి చర్యలు తీసుకున్నామని, ఆరోగ్యరంగం బలోపేతం దిశగా బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు.