2019 నాటి ఓటరు జాబితాతో ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు
- పాత ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారన్న విద్యార్థిని అఖిల
- 3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారని వెల్లడి
- పిటిషనర్ వాదన అర్థరహితమన్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది
- పూర్తి వివరాలతో రేపు వాదనలు వినిపిస్తామన్న పిటిషనర్
అయితే, పిటిషనర్ వాదన అర్థరహితమని ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అసలు, పిటిషనర్ ఓటు కోసం దరఖాస్తే చేయలేదని వెల్లడించారు. ఆ పిటిషన్ ను కొట్టివేయాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దాంతో పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో రేపు వాదనలను వినిపిస్తామని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దాంతో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.