కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం... యజమాని బిడ్డల కిడ్నాప్!
- ముంబైలో జరిగిన ఘటన
- కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
డ్రైవర్ తో కలిసి తన పిల్లలు జుహూకు వెళ్లారని, తిరిగి వస్తున్న క్రమంలో డ్రైవర్ ను అటకాయించిన కిడ్నాపర్లు, అతన్ని కొట్టి, తన పిల్లలను తీసుకెళ్లిపోయారని ఆ వ్యాపారి పోలీసులకు చెప్పాడు. ఇద్దరు పిల్లలను, డ్రైవర్ నూ బెదిరించి, వారిని తమతో తీసుకెళ్లారని, తన భార్యకు ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.
అప్పటికే పిల్లల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు జుహూ పీవీఆర్ ప్రాంతంలో ఓ బిడ్డను రక్షించగా, రెండో బిడ్డను స్థానికులు కాపాడారు. ఆపై కిడ్నాపర్ల ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగించిన పోలీసులు, తొలుత కారు డ్రైవర్ ను ప్రశ్నించారు. దాదాపు 18 గంటల విచారణ తరువాత, తన బిడ్డ వివాహం నిమిత్తం తానే ఈ దుర్మార్గానికి పాల్పడ్డానని అతను చెప్పాడు. తనకు పిల్లలను హత్య చేసే ఉద్దేశం లేదన్నాడు.
తానొక్కడినే ఇంత కిడ్నాప్ చేయలేనన్న ఆలోచనతో సగం డబ్బు ఇచ్చే ఒప్పందంపై ఓ సన్నిహితుడి తోడు తీసుకున్నానని అతను చెప్పడంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.