మోదీ ప్రభుత్వాన్ని మరోమారు కోరుతున్నా.. రాహుల్ గాంధీ ట్వీట్
- వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్న రాహుల్
- మహాత్మాగాంధీ సూక్తిని ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత
- ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్
ఇక ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్న ఆయన.. వాటిని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని మరోమారు అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ‘సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని రాహుల్ ట్వీట్ చేశారు.