గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్ఈసీ
- ఎన్నికల ప్రక్రియ కీలక సమయంలో ఉన్నప్పుడు బదిలీలు తగవన్న ఎస్ఈసీ
- బదిలీలు చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలి
- కొత్తగా వచ్చే సిబ్బందితో ఇబ్బందులు ఉంటాయన్న ఎన్నికల సంఘం
కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఎస్ఈసీ ఈ ఉదయం పేర్కొంది. పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇకపై ఎంతమందిని బదిలీ చేసుకున్నా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సీఈ ఈ ప్రకటన విడుదల చేసింది.