త్వరలోనే కాపు సంక్షేమ సేన నేతలతో సమావేశం ఉంటుంది: పవన్ కల్యాణ్
- హరిరామజోగయ్య తనకు లేఖ రాశారన్న పవన్
- కాపు సమస్యలు ప్రస్తావించారని వెల్లడి
- కాపు ప్రతినిధులతో సమావేశమవ్వాలని సూచించారని వివరణ
- తప్పకుండా సమావేశమవుతానని స్పష్టీకరణ
దేశ ప్రజలందరికీ 72వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
రేపు భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినమని పేర్కొన్నారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యంగా ఏర్పడడం వెనుక ఎందరో ఆత్మబలిదానాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన చరిత్రను యువతీయువకులు తెలుసుకోవాలని సూచించారు. వారు అందించిన విలువను పాటించాలని పిలుపునిచ్చారు.