ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రగడ.. గుజరాత్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- రెండు దశలుగా ఎన్నికలు
- రెండు వేర్వేరు తేదీల్లో ఓట్ల లెక్కింపు
- కోర్టుకెళ్తామన్న కాంగ్రెస్
ఈ విషయంలో నేడు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది. మరోవైపు, గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నగరపాలక సంస్థలకు వచ్చే నెల 21న, 81 పురపాలక సంఘాలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు 28న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. నగర పాలక సంస్థల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 23న, మిగిలిన వాటికి మార్చి 2న లెక్కింపు జరగనుంది. కాగా, ఓట్ల లెక్కింపును ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు రోజుల్లో చేపట్టనుండడంపై కోర్టులో సవాలు చేయనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.