Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు డుమ్మాకొట్టిన సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ అధికారులు!

  • పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ
  • వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేసిన నిమ్మగడ్డ
  • హాజరు కాని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు
  • సీఎస్, డీజీపీల కోసం వేచిచూసిన ఎన్నికల సంఘం అధికారులు
State government officials skips SEC video conference

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వేచి చూసినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో, తమకు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించడంలేదని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు, ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు బహిష్కరాణాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

More Telugu News