England: భారత్ తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

England squad announced for first two tests against Team India
  • ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
  • టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడనున్న ఇంగ్లాండ్
  • జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ పునరామగనం
  • బెయిర్ స్టో, శామ్ కరన్ లకు విశ్రాంతి
శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ రానుంది. భారత్ తో ఇంగ్లాండ్ జట్టు 4 టెస్టులు ఆడుతుంది. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. తన ఎక్స్ ప్రెస్ వేగంతో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించే జోఫ్రా ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేశాడు.

అలాగే, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఓపెనర్ రోరీ బర్న్ కూడా జట్టులోకి వచ్చారు. బెయిర్ స్టో, శామ్ కరన్, మార్క్ వుడ్ లకు టీమిండియాతో తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చారు. ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఓల్లీ పోప్ ఇంగ్లాండ్ జట్టుతో కలుస్తాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే...
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఓల్లీ స్టోన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, డామ్ బెస్, క్రిస్ వోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్.

రిజర్వ్ ఆటగాళ్లు...
జేమ్స్ బ్రేసీ, మాసన్ క్రేన్, సకిబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, ఓల్లీ రాబిన్సన్, అమర్ వర్దీ.
England
Squad
India
Test Series

More Telugu News