Chiranjeevi: చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

  • సూపర్ గుడ్ మూవీస్ కార్యాలయంలో భూమి పూజ
  • దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా
  • అభిమానులు కోరుకునే విధంగా సినిమా ఉంటుందన్న మోహన్ రాజా
Megastar Chiru new film kickstarted with a Pooja today

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, అల్లు అరవింద్, అశ్వనీదత్, కొరటాల శివ, జెమినీ కిరణ్, ఠాగూర్ మధు, మెహర్ రమేశ్, రామ్ ఆచంట, గోపి ఆచంట తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ కెరీర్ లో ఇది విభిన్నమైన సినిమా అవుతుందని చెప్పారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ లో ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు.

More Telugu News