అవినీతి కేసులో శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్ కు జైలుశిక్ష
- లంచం ఆరోపణలపై 2017లో లీ జే యాంగ్ అరెస్ట్
- శిక్ష విధించిన న్యాయస్థానం
- అప్పిలేట్ కోర్టుకు వెళ్లిన యాంగ్
- శిక్ష నిలుపుదల
- తీర్పును సమీక్షించాలంటూ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు
- రెండున్నరేళ్లు శిక్ష విధించిన సియోల్ హైకోర్టు
2017లో ఆయనను అరెస్ట్ చేయగా, కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై లీ జే యాంగ్ అప్పిలేట్ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పిలేట్ కోర్టు ఈ శిక్షను నిలుపుదల చేసింది. 2019లో ఈ కేసు సుప్రీంకోర్టుకు విచారణకు వచ్చింది. అప్పిలేట్ కోర్టు తీర్పును సమీక్షించాలంటూ సుప్రీంకోర్టు సియోల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన సియోల్ హైకోర్టు లీ జే యాంగ్ కు రెండున్నర సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది.