ప్రధాని నరేంద్ర మోదీకి టీకా ఎప్పుడు?: రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన సమాధానం ఇది!
- తొలి దశలో రాజకీయ నాయకులకు దక్కని కోటా
- రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్
- ఆ జాబితాలోనే మోదీ, ఇతర రాజకీయ నేతలు
- స్పష్టం చేసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
తాజాగా, ఓ జాతీయ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, మోదీ టీకా విషయంలో ఎప్పటికప్పుడు సైంటిస్టులతో మాట్లాడుతూ, అప్ డేట్స్ తీసుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. కరోనా యోధులకు టీకా ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మొదలైందని, ఇది ముగిసిన తరువాత, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాను ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని ఆయన అన్నారు. ఆ జాబితాలోనే మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఉంటారని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.