రైతు నిరసనల్లో ఉన్న నేతలు, నటులు సహా 40 మందికి ఎన్ఐఏ సమన్లు!
- 50 రోజులకు పైగా రైతుల నిరసనలు
- పలువురిని విచారణకు పిలిచిన ఎన్ఐఏ
- జాబితాలో బలదేవ్ సింగ్, దీప్ సింధు తదితరులు
ఈ విషయాన్ని ఎన్ఐఏ ఇన్ స్పెక్టర్ ధీరజ్ కుమార్ స్పష్టం చేస్తూ, లోధీ రోడ్డులోని సీజీఓ కాంప్లెక్స్ లో వీరిని విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు. రైతు నిరసనల వెనుక ఉన్న కొన్ని అరాచకశక్తుల గురించి ఆరా తీసేందుకే నోటీసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఇక తనకు అందిన నోటీసులను దీప్ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.