కాసేపట్లో జనగామకు బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం
- బీజేపీ కార్యకర్తలపై సీఐ మల్లేశ్ లాఠీఛార్జ్
- సీఐపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్
- బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు
మొదట ఆయన జనగామ పోలీసుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పనున్నారు. జనగామ సీఐపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛలో జనగామకు పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో జనగామకు బండి సంజయ్ రానున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీఐపై చర్యలు తీసుకోకుంటే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.