అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సినీనటి ప్రణీత
- లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ప్రణీత
- అందరూ విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి
- లాక్ డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు చేసిన కథానాయిక
ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరాళాలను అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. సినీ పరిశ్రమ నుంచి రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించిన తొలి వ్యక్తి ప్రణీత కావడం గమనార్హం. కరోనా సమయంలో కూడా ప్రణీత ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి, తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.