రైతుల ఇంట సంక్రాంతి శోభ కనిపించాలంటే బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్
- రైతుల వెతలపై సీఎం జగన్ కు లోకేశ్ లేఖ
- ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వెల్లడి
- ప్రభుత్వ ఉదాసీనతే అందుకు కారణమన్న లోకేశ్
- ప్రకృతి విపత్తులతో రైతు కుదేలయ్యాడని వివరణ
2020 ఖరీఫ్ ఆరంభం నుంచి ఏపీలో రైతులు వరుసగా సంభవించిన ప్రకృతి విపత్తులతో 50 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని, తద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారని లోకేశ్ వెల్లడించారు. సుమారు రూ.10 వేల కోట్ల పంట ఉత్పత్తులను కోల్పోయారని వివరించారు. అన్నదాతల ఇంట సంక్రాంతి శోభ కనిపించాలంటే రైతుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించి, వారికి చెల్లించాల్సిన బకాయిలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని తన లేఖలో స్పష్టం చేశారు.