భారత మార్కెట్ పై కన్నేసిన అమెరికా విద్యుత్ కార్ల సంస్థ
- భారత్ లో అమ్మకాలకు సిద్ధమైన ట్రైటాన్
- ఎన్4 సెడాన్ తో రంగప్రవేశం
- ప్రారంభ ధర రూ.35 లక్షలు
- ఒక్కసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 696 కిమీ ప్రయాణం
కాగా, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 75 కేడబ్ల్యూహెచ్, 100 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తోంది. 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 523 కిలోమీటర్లు, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 696 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ప్రీలాంచ్ బుకింగ్స్ జరుపుతున్నట్టు వెల్లడించాయి. అటు, విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా కూడా భారత్ లో కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.